చిత్రం: మురళీకృష్ణ (1964)
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల
నటీనటులు: నాగేశ్వరరావు , జమున
దర్శకత్వం: పి.పుల్లయ్య
నిర్మాత: వి.వెంకటేశ్వరులు
విడుదల తేది: 14.02.1964
మాస్టర్ వేణు ( సినీ నటుడు భాను చందర్ తండ్రి )
పల్లవి:
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
చరణం: 1
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం: 2
పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను…..
గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే… మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం: 3
నీ కలలే కమ్మగ పండనీ… నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..